telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఈరోజు బంగారం ధరలు ఇలా….

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటింది బంగారం. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 440 పెరిగి రూ. 53,400 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 190 పెరిగి రూ. 48,950 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 450 పెరిగి రూ.51,050కి చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 పెరిగి రూ.46,800 పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే రూ. 900 పెరగడంతో రూ.71, 500కి చేరుకుంది. 

Related posts