వివిధ మంత్రిత్వ విభాగాల్లో తాత్కాలికంగా పని చేస్తున్న ఉద్యోగులు పర్మినెంట్ చేయాలంటూ కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర కేబినెట్ తెలిపింది. ఈ సమస్యను అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు కావాల్సిన సమాచారం మొత్తం కోడీకరించి అందించేందుకు, సూచనలు, సలహాలు చేసేందుకు అధికారుల బృందం ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అటవీ, పర్యావరణ, ఆరోగ్య, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, పాఠశాలల విద్యాభివృద్ధి బృందం, దీనికి ఆర్థిక ముఖ్యకార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ రిపోర్టు జూన్ 30 వ తేదీ వరకు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను సూచించడం జరిగింది. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుకు కూడా ఏర్పాటు చేయబడిన కేబినెట్ సబ్ కమిటీకి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా ఈ కమిటీ పనిచేస్తుంది. 2020 మార్చి 31 లోగా సీపీఎస్ రద్దుకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు.


పరారీలో ఉండాల్సిన అవసరం మా ఆయనకు లేదు: అఖిలప్రియ