నిన్న అనారోగ్యంతో మృతి చెందిన హాస్యనటుడు వేణుమాధవ్ అంతిమ యాత్ర మొదలైంది. కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన వేణు మాధవ్ ని కడసారి చూసేందుకు అభిమానులు సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కి చేరుకుంటున్నారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన వేణుమాధవ్ను అభిమానులు, నటీనటుల కడసారి చూపు కోసం గురువారం మధ్యాహ్నం ఫిల్మ్ఛాంబర్కు తీసుకొచ్చారు. ఛాంబర్లో వేణుమాధవ్ పార్థివ దేహానికి ఆయన అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. వేణుమాధవ్ కడసారి చూపు కోసం భర్తతో కలిసి ఛాంబర్కు వచ్చిన సీనియర్ యాంకర్ ఉదయభాను కన్నీటి పర్యంతమయ్యారు. వేణుమాధవ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మౌలాలి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి భౌతికకాయాన్ని తీసుకువెళ్లనున్నారు. లక్ష్మి నగర్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వేణు మాధవ్ పెద్ద కుమారుడు మాధవ్ సవికర్ చేతుల మీదుగా వేణు భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేణు మాధవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Telugu Filmdom pays last respects to #VenuMadhav #RIPVenuMadhav pic.twitter.com/h6leSqVCqA
— BARaju (@baraju_SuperHit) September 26, 2019
Telugu Filmdom pays last respects to #VenuMadhav #RIPVenuMadhav pic.twitter.com/MuRzTc9W0X
— BARaju (@baraju_SuperHit) September 26, 2019

