తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టియఫ్సిసి) ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి . ఛైర్మన్ గా డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్, టిఎఫ్సిసి వైస్ ఛైర్మన్లు గా ఎ.గురురాజ్, నెహ్రు, సెక్రటరీగా జెవిఆర్. తెలంగాణ `మా` ప్రెసిడెంట్ గా రష్మి ఠాకూర్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రమేష్ నాయుడు తదితరులు ఎన్నికయ్యారు. కాగా ఈ రోజు టియఫ్సిసి ఛైర్మన్ తో పాటు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, `మా` ప్రెసిడెంట్ మంచు విష్ణు అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…“టియఫ్ ఫ్ సిసి` ఛైర్మన్ గా నాల్గవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతాని రామకృష్ణగౌడ్ గారికి మరియు ఇతర కమిటీ సభ్యులకు నా శుభాకాంక్షలు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది కళాకారులకు చేయూతనిస్తున్నారు. ప్రతాని రామకృష్ణగారి ఆధ్వర్యంలో మెంబర్స్ కు హెల్త్ కార్డులు, కరోనా సమయంలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేప్పట్టడం గొప్ప విషయం. ప్రస్తుతం మంచి సందేశాత్మక చిత్రాలు వస్తున్నాయి. . ఇక మీదట కూడా సినిమా పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడానికి శాయ శక్తులా కృషి చేస్తాం“ అన్నారు.
అనంతరం మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ…“ ప్రతాని రామకృష్ణగౌడ్, గురు రాజ్ గారిద్దరూ నేను మా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు నాకు చాలా సహక రించారు. చాలామందికి ఫోన్ చేసి నాకు ఓటు వేయమని రిక్వెస్ట్ చేశారు. వీళ్ళ ద్వారా నాకు చాలా ఓట్లు వేశారు. వీరికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నేను ఈ రోజు మా అధ్యక్షుడు హోదాలో కాకుండా వ్యక్తిగతంగా ఈ ప్రమాణ స్వీకారినికి రావడం జరిగింది అన్నారు.
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“మంచు విష్ణు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి మమ్మల్ని, మా టీం ను బ్లెస్ చేసినందుకు మా ధన్యవాదాలు. ఈ ఛాంబర్ కేవలం తెలంగాణ వారికే కాకుండా తెలుగు సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరికీ సంబంధించినది. మన ముఖ్యమంత్రి కె.సి ఆర్ గారితో కలసి ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఆయన వెంట ఉంటే నేను ఉన్నతమైన పదవిలో కొనసాగే వాణ్ని. కానీ నేను సినిమా ఇండస్ట్రీ ని అభివృద్ధి చేయాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. నేను నైజాంలో 125 సినిమాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాను, 1990 లో శివాజీ రాజా హీరోగా చేసిన అల్లరి పెళ్ళాం సినిమాతో నిర్మాతగా మారి అనేక సినిమాలు నిర్మించాను. అలాగే నేను 7 సినిమాలకు దర్శకుడిగా కూడా పని చేయడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాకు దర్శకత్వం వహించే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీకి మేలు చేయాలనే తలంపుతో ఏడుగురు సభ్యులతో ప్రారంభమైన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ఈరోజు 10 వేల మంది సభ్యులు కావడం చాలా సంతోషంగా ఉంది.. వెంకయ్య నాయుడు హెల్త్ మినిష్టర్ గా ఉన్నపుడు హెల్త్ కార్డ్స్ గురించి తెలియజేయడంతో వారు స్పందించి సుమారు 8,000 మందికి హెల్త్ కార్డులు ఫ్రీ గా ఇప్పించడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. కరోనా టైంలో మేము 20,000 మంది ఆర్టిస్టులకు నిత్యావసర సరుకులు అందజేశాము.

అలాగే డిగ్రీ చదువుతున్న పిల్లలకు 15,000 రూపాయల స్కాలర్ షిప్ వచ్చే ఏర్పాటు చేస్తున్నాము.ఆర్టిస్టులు ఎక్కడ ఇల్లు కొనుకున్నా 2,50,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. ఎంతో మంది ఇల్లు లేని పేద ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ ఎంతో మంది ఉన్నారని ఇళ్ల స్థలాల కోసం 10 ఎకరాలు ఇవ్వమని మన ప్రియతమ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారిని కలసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా త్వరలో జరగబోతుంది. ఇలా చేతనైనంత వరకు మేము సహాయం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో తెలంగాణ ఆంధ్ర అనేది కాకుండా మనమంతా తెలుగు సినిమా పరిశ్రమను ఇంకా అభివృద్ధి చేసుకొనే దిశగా అడుగులు వేయాలనే తలంపుతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అందరి సహాయ సహకరాలతో ముందుకు వెళ్తామని ఆన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బి.కిషోర్ పటేల్, ఆర్గనైజర్ సెక్రెటరీ డాక్టర్ వి.రామారావు గౌడ్, టి.మా వైస్ ప్రెసిడెంట్ జ్యోతి రెడ్డి, జాయింట్ సెక్రటరీస్ వేణు గోపాల్ రావ్, కల్యాణి నాయుడు, రాజయ్య, జి.చెన్నారెడ్డి,ఆర్గనైజింగ్ సెక్రటరీస్ యమ్.అశోక్,కె.యల్. యన్.ప్రసాద్, ఈ.సి మెంబర్స్ లయన్ డి.ప్రేమ సాగర్, లయన్ సి.హెచ్.శ్రీశైలం హాజరయ్యారు

