చెన్నై చంద్రం త్రిష తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి చాలా పోస్టులను తొలగించారు. దీంతో ఆమె ఎందుకు పాత పోస్టులను డిలీట్ చేశారని అభిమానులు ఆలోచనలో పడ్డారు. కాగా, కొన్ని రోజులు పాటు ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు దూరంగా ఉంటాని జూన్లో ప్రకటించారు. అయితే పాత పోస్టులు డిలీట్ చేయడం ఎందుకో ఎవరికీ అర్థంకాని విషయం. ప్రస్తుతం త్రిష ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కేవలం ఏడు పోస్టులు కనిపిస్తున్నాయి. ఇళయదళపతి విజయ్తో నటించిన ‘గిల్లి’ మూవీలోని కొన్ని సీన్స్తో కూడి వీడియోనే ఆమె చివరి పోస్టు. ఈ విషయంపై త్రిష ఇంతవరకూ స్పందించలేదు. త్రిష చివరిగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ కనిపించారు. ఈ షార్ట్ ఫిల్మ్ శింబు హీరోగా నటించిన ‘విన్నైతండి వరువాయ’కు సీక్వెల్. చారిత్మ్రాతక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో త్రిష ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
previous post