తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1492 కరోనా కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 609417 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1933 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 586362 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3534 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 19521 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,19,464 మందికి కరోనా పరీక్షలు చేయడంతో.. ఇప్పటివరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,71,90,350 కు చేరింది. ఇక ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో 166 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
previous post
next post