ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,02,712 శాంపిల్స్ పరీక్షించగా 6,151 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే కోవిడ్తో 58 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో 7,728 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,83,29,021 కి చేరగా.. యాక్టివ్ కేసులు 69,831 గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 17,50,904 కరోనా నుంచి కోలుకోగా 12,167 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 2,08,39,147 కు చేరింది.