తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2157 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఎనిమిది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 821 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,738 కు చేరగా.. రికవరీ కేసులు 3,07,499 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1780 మంది మృతి చెందారు.. రికవరీ రేటు దేశంలో 89.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 92.21 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,131 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 16,118 మంది హోం క్వారంటైన్లోనే ఉన్నారు.. ఇక, నిన్న ఒకే రోజు 72,364 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్ల సంఖ్య 1,12,53,374 కు చేరుకున్నట్లు బులెటిన్లో పేర్కొంది సర్కార్.
previous post
next post
తండ్రీ కొడుకులు శూన్య తెలంగాణ చేస్తున్నారు: వివేక్