telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

వేడినీళ్లలో.. ఆస్తిపత్రాలు వెతుకున్న భార్య.. !!

wife harrasing husband for wealth

పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులకు ఆశలు బోలెడన్ని ఉండటం సహజం. కానీ వాటిని సాదించేందుకు వారు తీవ్రంగా కష్టపడుతుంటారు. కొందరు అలా కష్టించినా ప్రయోజనం ఉండటంలేదనే ఆక్రోశంతో ఆవేశంతో తప్పుడు దారులలో ప్రయాణించేందుకు కూడా సిద్ధం అవుతుంటారు. అవి తప్పని తెలిసినా, బిడ్డల కోసం చేయడానికి తప్పనిసరి అనుకుంటారు. కానీ అటువంటి దారులు ఫలితాలు సత్వరంగా ఇచ్చినా, రేపటి రోజున అవే పిల్లలకు శాపాలుగా పరిణమిస్తాయనే చిన్న విషయాన్నీ ఆ క్షణంలో తల్లిదండ్రులు మరచిపోతుంటారు. దీనితో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ఒకటి ఆస్తి గొడవలు. తాజాగా, ఆస్తి కోసం కట్టుకున్న భర్తపై ఓ మహిళ వేడివేడి మసిలే నీటిని పోసింది. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

విజయవాడ అయోధ్యనగర్ కి చెందిన అట్టూరి వెంకట రమణ(49) హైదరాబాద్ లో భవన నిర్మాణ పనులు చేస్తుంటాడు. వెంకట రమణకు 18ఏళ్ల క్రితం హేమలతతో వివాహమైంది. హేమలత.. నగరపాలక సంస్థ పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. గత కొంతకాలంగా భార్య, భర్తల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి.

భర్తపేరిట ఉన్న ఆస్తిని.. తన పేరిట, పిల్లల పేరిట రాయాల్సిందిగా హేమలత కొంతకాలంగా వెంకట రమణను వేధించడం మొదలుపెట్టింది. అతను నిరాకరించడంతో.. భర్తపై వేడి వేడీ మసిలే నీటిని మీద పోసేసింది. దీనితో.. అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts