telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ను అడగకుండా జగన్ ఏ పని చేయలేరు: ఎమ్మెల్సీ అశోక్‌ బాబు

ashok babu mlc

రాష్ట్రంలో విద్యుత్తు కోతల పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను అడగకుండా సీఎం జగన్ ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను అడిగి కొత్తగూడెం నుంచి బొగ్గు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అప్పుడే విద్యుత్ కోతలు ప్రారంభం అయ్యాయన్నారు.

ప్రాజెక్టులన్నీ నీటితో నిండి ఉన్న విద్యుత్ కోతలా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక ఇప్పటికే పరిశ్రమలు వెనక్కి పోతున్నాయని చెప్పారు. ఇక విద్యుత్ కోతలు ఉంటే పూర్తిగా వెళ్లి పోతాయని ఆరోపించారు. విద్యుత్ కోతల ప్రభావం రాష్ట్ర ఆర్దిక రంగంపై కూడా పడుతుందని వివరించారు.

Related posts