*టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం
*చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న చర్చ..
*అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
*స్పీకర్ హుందాగా వ్యవహారించాలి..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. అసెంబ్లీ శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచనలు చేశారు.
ప్రధానంగా ప్రజా సమస్యలను ఉభయసభల్లోనూ గట్టిగా ఎత్తి చూపాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.