telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య… ఆఖరి రోజు ఏం జరిగిందంటే ?

Sushanth

జూన్ 14న సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని ఇప్పటికే విచారించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అటు బీహార్ పోలీసులకు కూడా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై అతని తండ్రి ఫిర్యాదు చేశారు. ఇక సుశాంత్ మరణం వెనుక రాజకీయ, సినీ ప్రముఖుల పాత్ర ఉన్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి హస్తముందని సుశాంత్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అసలు జూన్ 14న ఏం జరిగిందనే విషయం మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. తాజాగా మీడియాతో మాట్లాడిన సుశాంత్ కుక్ నీరజ్ సింగ్ కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. “జూన్ 14 ఉదయం సుశాంత్ తన రూమ్ నుంచి బయటకు వచ్చి కూలింగ్ వాటర్ అడిగారు. అప్పుడు ఆయన కొంచెం టెన్షన్‌గా ఉన్నారు. అనారోగ్యంగా కనిపించారు. ముందు రోజు రాత్రి కూడా సుశాంత్ భోజనం చేయలేదు. 14 ఉదయం టిఫిన్ గురించి సుశాంత్‌ను కేశవ్ (మరో వంట మనిషి) అడిగాడు. `కొబ్బరి నీళ్లు, ఓ అరటి పండు, జ్యూస్` మాత్రం ఇమ్మన్నారు. మరి, లంచ్‌కు ఏం చేయాలని అడిగితే.. రిప్లై ఇవ్వలేదు” అని నీరజ్ అన్నాడు.

Related posts