తమిళ సూపర్స్టార్ రజనీకాంత్.. ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. రజనీకి ఫాల్కే అవార్డును అందజేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ మార్చిలోనే ప్రకటించారు. తన నటనతో కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న రజనీకాంత్ తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

రజనీకాంత్ను 2019 ఏడాదికిగానూ ఈ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రం. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ప్లే రచయితగా సినీరంగానికి రజనీకాంత్ చేసిన విశిష్ఠ సేవలకుగానూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు రజనీకాంత్ చేస్తున్న సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయనను ఈ పురస్కారంతో గౌరవించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేశారు.

కాగా ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్ అసురన్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. దీంతో ఒకే ఏడాదిలో రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా.. రజినీ తనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో నన్ను సత్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డును నా గురువు కె. బాలచందర్ సర్కు అంకితం చేస్తున్నాను. నా తండ్రి లాంటి సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ నాకు గొప్ప విలువలు నేర్పించినందుకు, నాలో ఆధ్యాత్మికతను పెంపొందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని అన్నారు.

అలాగే నా స్నేహితుడు, తన స్నేహితుడు, బస్ కండక్టర్ అయిన రాజ్ బహదూర్ నాలోని నటుడిని గుర్తించి నన్ను సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించిన వ్యక్తి.. నన్ను నమ్మి నాతో సినిమాలు చేసిన గౌరవనీయులైన దర్శకులు, నిర్మాతలకు నా కృతజ్ఞతలు. సాంకేతిక నిపుణులకు, పంపిణీదారులకు ధన్యవాదాలు. ప్రదర్శకులు, మీడియా, నా అభిమానులందరికీ, తమిళ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మీరు లేకుండా నేను లేను” అంటూ చెప్పుకొచ్చారు.
Superstar @rajinikanth receives India's highest film honour #DadasahebPhalkeAward at 67th National Film Awards for his outstanding contribution to the world of Indian Cinema 🎥#NationalFilmAwards2019 pic.twitter.com/TdgmuHbzzZ
— PIB India (@PIB_India) October 25, 2021

