తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఎస్ఐ ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడారు. పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. 18,428 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్స్ నియామకాలు జరిపామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తెలంగాణ పోలీసులకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. కరోనా, భారీ వర్షాల్లోనూ పోలీసులు అందించిన సేవలు చాలా గొప్పవని కొనియాడారు. పేదలకు సేవలు చేయడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. త్వరలోనే 20 వేల పోలీస్ నియామకాలు జరుపుతామని స్పష్టం చేశారు. ఈ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కటి గౌరవం ఇవ్వాలన్నారు మహమూద్ అలీ.