telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టి20 కి మిథాలీ రిటైర్మెంట్ .. ఆ స్థానంలో 15ఏళ్ళ పిడుగు ..

shefali verma in mithali raj place

భారత మహిళల క్రికెట్ లో మిథాలీ రాజ్ ఓ శిఖరం, అన్ని ఫార్మాట్లలోనూ రాణించిన ఆమె తాజాగా టి20 క్రికెట్ కు గుడ్ బై చెప్పేసింది. దాంతో ఆ లెజెండ్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడా ఉత్కంఠకు సెలెక్టర్లు తెరదించారు. 15 ఏళ్ల హర్యానా యువ సంచలనం షెఫాలీ వర్మకు భారత మహిళల టి20 క్రికెట్ జట్టులో స్థానం కల్పించారు. త్వరలోనే దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ లో షెఫాలీ కూడా ఆడనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి 3 మ్యాచ్ లకు ఆమెను ఎంపిక చేశారు.

వర్మకు భారత క్రికెట్లో చిచ్చరపిడుగు అనే ట్యాగ్ ఉంది. సెహ్వాగ్ తరహాలో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగల షెఫాలీ దేశవాళీ క్రికెట్ లో 150కి పైగా స్ట్రయిక్ రేట్ తో మెరుపులు మెరిపించింది. టీమిండియా తరఫున ఆమె ఓపెనర్ గా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts