తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కు కేంద్రం భధ్రత పెంచింది.
గత రెండు రోజులు గా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబు నాయుడి నివాసము, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గము తదితరాలను పరిశీలించారు..
ఆమేరకు అదనముగా 12×12 రెండు బ్యాచ్ లుగా 24 మంది బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు.
ఒక పక్క యూపీ సి.ఎం యోగీ ఆదిత్యనాధ్, కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ లకు రక్షణ తగ్గించారు.
ఇదే సమయంలో చంద్రబాబు కు రక్షణ పెంచటము ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ లలో హట్ టాపిక్ గా మారింది.


ఆమెపై ఉమ్మేస్తే జనాలు నాపై ఉమ్మేస్తారు… అయినా ఉమ్మేశా… : నాగశౌర్య