తొలిసారిగా తన విడాకులు సమంత నోరు విప్పింది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షో సీజన్ 7 ఎపిసోడ్ 3కు సమంత.. అక్షయ్ కుమార్తో కలిసి పాల్గోంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ సమంతను తన పెళ్ళి, విడాకులపై కొన్ని ప్రశ్నలు అడిగారు. దాంతో సమంత మాట్లాడిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సమంత ఈ కార్యక్రమంలో నాగచైతన్యకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది.
విడాకుల తర్వాత జీవితం కష్టంగా మారిందని, కానీ ప్రస్తుతం బాగానే ఉందని కానీ మునుపటి కన్నా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు తెలిపింది. ‘నాగచైతన్యతో విడిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంది?’ అని వ్యాఖ్యాత కరణ్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం చెప్పింది.
అంతేకాకుండా కరణ్ ఓ ప్రశ్న అడుగుతోన్న సమయంలో.. “నీ భర్త నుంచి విడిపోయినప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు?” అని కరణ్ అడగ్గా.. ‘భర్త కాదు మాజీ భర్త’ అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. దీనికి కరణ్.. క్షమాపణలు కూడా చెప్పి ఇంటర్వ్యూ కొనసాగించారు.
మేమిద్దరం విడిపోవడం సులభంగా జరగలేదు. విడిపోయిన సమయంలో మనోవేదనకు గురయ్యా. ప్రస్తుతం బాధ నుంచి బయటపడ్డా. ఎప్పడూ లేనివిధంగా దృఢంగా సిద్ధమయ్యాను అని తెలిపింది.
.మేమిద్దరం విడిపోయినప్పుడు నాపై నెగెటివ్ ప్రచారం జరిగింది. సోషల్ మీడియా తనకు వ్యతిరేకంగా ట్రోలింగ్, కామెంట్లు వచ్చినప్పుడు అందుకే తాను నిజంగా ఏ ఫిర్యాదు చేయలేకపోయానని అన్నారు.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి నేను పెద్దగా బాధ పడలేదు. ట్రోల్ చేసే వారు నా జీవితంపై పెట్టుబడి పెట్టారు. అప్పుడు వాటికి స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు లేవు. నేను ఓపెన్గా ఉండాలనుకున్నా. అందుకే విడిపోయిన విషయాన్ని అందరితో చెప్పా.
మేము విడిపోయిన కొన్నిరోజులకే ‘ఊ అంటావా’ సాంగ్ ఆఫర్ నాకు వచ్చింది. ఆ పాట నాకెంతో నచ్చింది. అందుకే అందులో యాక్ట్ చేశా. ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలు ఎత్తిచూపించడానికి ఈ పాట సరైందని, నాలాంటి స్టార్ సెలబ్రిటీ చెబితే తప్పకుండా అందరికీ చేరువవుతుందని భావించా” అని సామ్ తెలిపారు.
ఇక సమంతను బాగా బాధపెట్టిన సోషల్ మీడియా ట్రోలింగ్ ఏంటని కరణ్ ప్రశ్నించారు. దీనికి సమంత… తాను నాగచైతన్యకు విడాకులు ఇవ్వడానికి రూ.250కోట్లు తీసుకున్నానని వచ్చిన వార్తలు తనను ఎంతగానో బాధపెట్టాయని సమంత చెప్పింది.
అంతేకాకుండా ఆ వార్తలు చూసి ఎవరైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు మా ఇంటికి వచ్చి, దాడులు చేసి.. అవన్నీ అవాస్తవాలని చెబితే బాగుండు అని ప్రతి రోజూ ఎదురుచూసేదాన్ని అని ఆమె వివరించారు.
మీ ఇద్దరి మధ్య ఏమైనా హార్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా అని కరణ్.. సమంతను ప్రశ్న వేశాడు. దీనికి సమంత షాకింగ్ సమాధానం ఇచ్చింది. మీరు నన్ను నాగచైతన్యను ఒకే గదిలో వేసినట్లయితే.. ఆ గదిలో పదునైన వస్తువులు ఏవీ లేకుండా చూసుకోవాలి అని కరణ్కు సమాధానం చెప్పింది. ప్రస్తుతం… తనకు చైకు మధ్య పరిస్థితులు అలాగే ఉన్నాయని.. భవిష్యత్తులో అవి మారవచ్చు అని సమంత పేర్కొంది. ఇక సమంత తనను ఎక్కువగా వ్యక్తిగత ప్రశ్నలు వేయొద్దంటూ కరణ్ జోహార్ను కోరింది అంతేకాకుండా భవిష్యత్తులో తాను ప్రేమలో పడే అవకాశం లేదని చెప్పుకొచ్చారు.
కాఫీ విత్ కరణ్ షోలో సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన సమంత వ్యాఖ్యలపైనే జోరుగా చర్చించుకుంటున్నారు.
తిని కూర్చొని బరువు పెరగడం లేదు : నిత్యామీనన్