శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. రాజాం మండలం మొగిలివలస బ్రిడ్జి దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థిని రాధిక మృతిచెందింది. మృతురాలి స్వస్థలం రాజాం మండలం అగ్రహారం గ్రామంగా గుర్తించారు. కుమార్తెను చూసి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టన్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

