telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియా చక్రవర్తి కస్టడీ పొడిగింపు

Rhea

బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు, డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. అక్టోబర్ 20 వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ సేకరించిందనే ఆరోపణలు రావడంతో రియాను సెప్టెంబర్ 9న పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆమె ఎన్నో సంచలన విషయాలు వెల్లడించింది. రియా వాంగ్మూలం ఆధారంగా దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో రియా కస్టడీని అక్టోబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముంబయి సెషన్స్ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ కోరుతూ రియా చక్రవర్తి సెప్టెంబర్‌లోనే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌, ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీబీ త్రీవంగా వ్యతిరేకించింది. వారు డ్రగ్స్ సరఫరా చేశారన్న దానిపై నిజనిర్ధారణకు వచ్చే వరకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరింది. దీనిపై బుధవారం న్యాయస్థానం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts