హీరోయిన్ నీతి టేలర్ తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆగష్టులో తన చిరకాల స్నేహితుడు పరిక్షిత్ భవను వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. “మిస్ నుంచి మిసెస్గా మారాను. ఈ విషయాన్ని నన్ను అభిమానించే వారందరికి చెప్పాలని అనుకుంటున్నాను. ఆగష్టు 13, 2020న పరిక్షిత్ను వివాహం చేసుకున్నాను. కోవిడ్ కారణంగా కుటుంబ సభ్యులు దగ్గరి బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పడు నేను గట్టిగా చెప్పగలను ‘హలో హస్బండ్’ అంటూ పేర్కొన్నారు. తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను మంగళవారం ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్న సందర్భంగా వివాహాన్ని దాచిపెట్టినట్లు పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతరించిన అనంతరం గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపారు. ఇక తెలుగులో తనిష్తో కలిసి ‘మేము వయసుకు వచ్చాం’ సినిమాలో నటించిన నీతి టేలర్ చేసిన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. ఆ తరువాత ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో నటించినప్పటికీ అప్పటి నుంచి సినిమాల్లో ఎక్కువ కనిపించలేదు. అనంతరం టెలివిజన్ స్టార్గా మారి బుల్లితెర షోలో మెరిశారు.
previous post
next post