కేరళం అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలు సైతం కేరళం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు.
ఈరోజు ఆయన కేరళంకు బయలుదేరనున్నారు. అక్కడ రెండు రోజుల పాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
రేవంత్ రెడ్డిని కేరళం ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన పలు ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.
తెలంగాణకు చెందిన మరో కీలక మంత్రి శ్రీధర్ బాబు కూడా కేరళంలో ప్రచారం చేయనున్నారు . ఆయనకు ఎర్నాకులం, హోసూరు జిల్లాల ఇంచార్జి బాధ్యతలను అప్పగించారు.
ఏప్రిల్ 7 వరకు అక్కడే ఉండి ప్రచారం కొనసాగించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేరళంలో ప్రచారం ప్రారంభించారు.
పతినంతిట్ట జిల్లాలోని ఆడూరు, అరుణ్మల నియోజకవర్గాల్లో ఆయన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.

