మరోసారి ఎన్నికల అనంతరం ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. గతంలో చంద్రబాబుతో సహా పలువురు నాయకులను వణికించిన ఈ కేసు ఇటీవల స్తబ్దుగా ఉన్నా, ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతుందని చెప్పడం తెలిసిందే. దాని ఫలితమే నేడు మరోసారి ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
దీనితో తాజాగా, కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి అనుచరుడు వేం నరేందర్రెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. ఓటుకు నోటు కేసులో రూ. 50 లక్షలపై ఈడీ వివరణ కోరింది. వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. గచ్చిబౌలి రోలింగ్హిల్స్లోని వేం నరేందర్రెడ్డి ఇంటికి వెళ్లి ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు.