శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో “రణరంగం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాకినాడ ప్రాంతంలో ఉండే చిన్న రౌడీ… మాఫియాగా మారే నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడని చెబుతున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానున్న విషయం విదితమే. ఇటీవల ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఈ సినిమాతో మంచి హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నాడు శర్వానంద్.
ఈ చిత్ర సౌండ్ కట్ ట్రైలర్ను హీరో రామ్చరణ్ ఆదివారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌండ్ కట్ ట్రైలర్ అద్భుతంగా, టెర్రిఫిక్గా వుంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్లో శర్వానంద్ను మేము ఎలా చూడాలనుకున్నామో అలాగే వున్నాడు.థియేట్రికల్ ట్రైలర్ పర్ఫెక్ట్గా వుంది. శర్వా నటించిన కో అంటే కోటి నాకు చాలా ఇష్టం. అలాంటి భావోద్వాగాలతో కూడిన చిత్రం మళ్లీ శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ చూశాక అలాంటి సినిమానే అనిపించింది. ఈ చిత్రంతో దర్శకుడు సుధీర్వర్మ తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. చాలా మంచి కథతో రూపొందిన చిత్రమిది. సన్నివేశాల తాలూకు కట్స్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. ప్రశాంత్ పిైళ్లె అందించిన నేపథ్య సంగీతం బాగుంది. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాల్గొన్నారు.
నయనతారకు ఎందుకు సారీ చెప్పాలి ? : రాధారవి