పక్షిలాగే భూమికి చేరావు
ధరణి మీద తిరుగాడే
జీవులలో నీవు ఒక్కటయ్యావు !
అతిథిగా వచ్చానని మరచి
ఆదిపత్యం చలాయించావు!
చూసిన ప్రతి దాన్ని
స్వార్ధానికి బలి చేశావు
నచ్చింది తిన్నావు
తిరగబడిందాని అంతం చేశావు
చెట్టు పుట్ట గోడ్డు గోదా
అంతా నాశనం చేసావు!
చివరికి మిగిలింది నీ జాతే
అదే మానవజాతి
మీలో మీకే అంతరాలు
కులాల, మతాల తారతమ్యాలు
ఉన్నోడు లేనోడిని శాసించడానికి
వెలసిన అగాధాలు!
నీకు కాలం చెల్లే రోజులు వచ్చాయి
వీరబ్రహ్మం గారు చెప్పినట్టు
మనిషిని మనిషి పీక్కొని తినే రోజు
భూమి అంతానికి తార్కాణంగా నిలిచే రోజు…
ఇకనైనా కళ్లు తెరిచి మసులుకో
రాబోయే తరాలకు భూమి ఆనవాళ్లు మిగిల్చిపో…!!

