ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా, సౌత్ రీజియన్ సభ్యుడిగా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అద్యక్షుడు పొన్నం రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు FFSSR కార్యదర్శి బి. ఎస్. ఎస్. ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ప్రకాశ్ రెడ్డి ఎన్నిక పత్రాన్ని రవిచంద్ర కు అందించారు. రవిచంద్ర గత కొన్నేళ్లుగా ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ అనేక సినీ వ్యాసాలు రాస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ గా, ఫిల్మ్ క్రిటిక్ గా సూపరిచితులైన రవిచంద్ర రాసిన ‘ప్రస్థానం’ సినీ గ్రంధము ఉత్తమ సినిమా గ్రంధంగా ఎంపికయి నంది అవార్డు సొంతం చేసుకుంది.
ఆయన బాలీవుడ్ నటులు పైడి జైరాజ్ పై రూపొందించిన డాక్యుమెంటరీ పలు ఇంటర్నేషనల్ వేదికలపై ప్రదర్శించబడి ఆరు అవార్డులను అందుకోగా, ఇటీవలనే వచ్చిన ‘సర్దార్ సర్వాయి పాపన్న’ డాక్యుమెంటరీ పలువురి ప్రశంశలు పొందింది. రవిచంద్ర ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ సభ్యుడిగా ఎంపిక కావడం పట్ల కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ సబ్యులతో పాటు, ఫిల్మ్ క్రిటిక్ హెచ్. రమేష్ బాబు, పి. వి. రామ్మోహన రాయుడు, పి. ఎస్. రవీంద్ర, అక్షరయాన్ అద్యక్షురాలు అయినంపూడి శ్రీలక్ష్మి, అన్నవరం దేవేందర్, కె ఎస్ ఆనంతాచార్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


మీటూ ఆరోపణల వల్ల అవకాశాలు దూరం : తమన్నా