బాలీవుడ్ నటి పాయల్ ఘోష్… దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “నన్ను ఇబ్బంది పెట్టిన దర్శకుడెవరో కాదు.. అనురాగ్ కశ్యప్. అయితే ఇప్పుడు ఆయన స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను చూస్తుంటే జోక్లాగా అనిపిస్తోంది. నేను అనురాగ్తో మాట్లాడిన మరుసటి రోజు ఆయన ఫోన్ చేస్తే వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన మద్యం తాగుతున్నాడు. దాంతోపాటు గంజాయిలాంటిదేదో తీసుకుని ఉన్నారనుకుంటున్నాను. ఆయన్ని కలిసిన తర్వాత మరో గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలో క్యాసెట్స్, పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడే ఉన్న సోఫాలో ఇద్దరం కూర్చున్నాం. ఆ సమయంలో అనురాగ్ కశ్యప్ ‘బాంబే వెల్వెట్’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రణభీర్ కపూర్ సినిమాలో కనీసం ఒక సీన్లో అయినా నటించాలనుకునే అమ్మాయిలు నాతో పడుకోవాలనుకుంటారన్నాడు. అలాగే అమితాబ్లాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి అభిషేక్ బచ్చన్తో సినిమా చేయమని అడుగుతున్నాడని, అలాగే కరణ్ జోహార్ నాతో ప్రతి విషయం మాట్లాడుతాడని.. నేను ఆ లెగసీని ఎంజాయ్ చేస్తున్నానని, తను ఎంత గొప్ప వ్యక్తో అర్థం చేసుకోవాలని, తనతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్తులో నాకు మేలుజరుగుతుందని అన్నాడు. సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద తప్పేం కాదన్నట్లు నాతో మాట్లాడాడు. హ్యుమా ఖురేషి, రిచా చద్దా, మహిగిల్ వంటి హీరోయిన్స్ నాకు ఫోన్ కాల్ దూరంలో ఉంటారని, నేనెప్పుడు పిలిచినా వచ్చి నేనేం చేయమంటే అది చేస్తారని అప్పుడాయన చెప్పారు. నేను కూడా వారిలాగానే చేస్తానని అనుకున్నాడు. మాట్లాడే సమయంలో అక్కడే నన్ను బలవంతం చేయబోయాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. నేను అన్కంఫర్ట్బుల్గా ఉన్నాను, శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేనని, తర్వాత కలుస్తానని చెప్పి వచ్చేశాను. విషయం 2014లోనో 2015లోనో జరిగింది. నాకు సరిగా గుర్తులేదు. ఆ సమయంలోనే నేను బయటకు చెబుదామంటే నన్ను చాలా మంది వద్దని భయపెట్టారు. నీపై యాసిడ్ దాడి జరగొచ్చు, నిన్ను కిడ్నాప్ చేయవచ్చునని అన్నారు. ఇతర ఆర్టిస్టులను వారెంతో బాధపెట్టారనే విషయాన్ని చెప్పారు. ఒక అమ్మాయి డైరెక్టర్ని సినిమా అవకాశం కోసం వచ్చి కలవొచ్చు. అంతమాత్రాన వేశ్య కాదు” అన్నారు పాయల్ ఘోష్.
previous post