పుల్వామా ఉగ్రదాడితో పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతుంది. ఈ దాడిని అంతర్జాతీయ సమాజం ఖండించడంతో పాక్ ఆత్మరక్షణలో పడింది. ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేసే విషయంలో భారత్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గుండెల్లో దడ మొదలైంది. మరిన్ని ఇబ్బందులు తలఎత్తకుండా మరోవైపు, ఎదురు కాకుండా దిద్దుబాటు చర్యలకు పాకిస్థాన్ దిగింది. కొంత కాలం మౌనంగా ఉండాలంటూ పుల్వామా ఘటనకు బాధ్యుడైన జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, 26/11 ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ లకు సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. బహిరంగ ప్రదేశాల్లో కనిపించవద్దని, ప్రసంగాలు ఇవ్వరాదని వీరిని కోరింది. లోప్రొఫైల్ మెయింటైన్ చేయాలని సూచించింది.
వైఎస్ జగన్ అవినీతి రాజ్యానికి రాజు: ఎమ్మెల్సీ అశోక్ బాబు