పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరోసారి భారత్పై తన అక్కసు వెళ్లగక్కారు. పాకిస్తాన్పై ఎలాంటి దుస్సాహసానికి దిగినా భారత్కు తమ సైన్యం గట్టి జవాబు చెబుతుందంటూ తన వక్రబుద్ధిని చాటుకున్నారు. ముషారఫ్ మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు వార్తలు వెలువడుతున్న క్రమంలోనే ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించడం గమనార్హం.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో దుబాయ్ నుంచి ఆయన ఓ వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. పాకిస్తాన్ శాంతి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ భారత్ పదే పదే యుద్ధానికి కాలుదువ్వుతోందని ముషారఫ్ ఆరోపించారు. స్థానిక మీడియా చెబుతున్న దాని ప్రకారం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం దుబాయ్లో చికిత్స పొందుతున్నారు.
ప్యాకేజీలు తీసుకుని పవన్ చంద్రబాబుకు పనిచేస్తున్నారు: రోజా