పవర్స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా ప్రాధాన ప్రాత్రల్లో నటిస్తున్న సినిమాలో హీరోయిన్ నిత్యామీనన్ ఎంట్రీ ఇచ్చిందని చిత్రయూనిట్ అధికారక ప్రకటన విడుదల చేశారు. మలయాళ హిట్ సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ను తెలుగులో రీమేక్ చేస్తోన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తుండగా, యువ దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తయిందట. నిత్యా మీనన్ ఈ సినిమాలో పవన్ పక్కన ఆయన భార్యగా నటించనుందని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాలో భీమ్లా నాయక్గా కనిపించనున్నారు. ఈ సినిమాకు పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట.
ఇక ఈసినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.