telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కాశీబుగ్గ విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట తొమ్మిది మంది భక్తులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం కాశీబుగ్గలో ఉన్న విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. తొమ్మిది మంది భక్తులు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి.

క్షతగాత్రుల్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు తరలివచ్చారు.

అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆలయంలో ఏర్పాటు చేసి క్యూలైన్లకు సంబంధించిన రెయిలింగ్ ఊడిపడటంతో భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు.

ఆలయానికి వచ్చిన వారిలో ఎక్కువమంది మహిళా భక్తులు ఉన్నారని చెబుతున్నారు.

ఈ ఆలయాన్ని 12 ఎకరాల్లో నిర్మించినట్లు చెబుతున్నారు. పండా కుటుంబం తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం దక్కలేదని కాశీబుగ్గలో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఏకాదశి రోజు ఇంతమంది భక్తులు వస్తారని అంచనా వేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు. ఈ తీవ్ర విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts