telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనవరిలో స్థానిక సమరం.. సిద్ధంగా ఉండాలన్న ఏపీసీఎం..

AP

ఏపీసీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు(గురువారం) హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయనున్నది.

నేడు జరిగిన సమావేశంలో ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ తరపున అథరైజేషన్‌ను మంత్రుల నుంచి తొలగించి కలెక్టర్లు, సెక్రటేరియట్‌లో హెచ్‌వోడీలకు అధికారం ఇచ్చారు. 20 కోట్లకుపైగా ఆదాయం వచ్చే దేవాలయాలకు ట్రస్ట్‌బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ట్రస్ట్‌ బోర్డుల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రులకు జగన్ సూచించారు.

Related posts