telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాలకొల్లులో పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు

రాష్ట్రంలో ప్రతినెలా ఒకటో తేదీ పెన్షన్ల పండగే, దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని  రామానాయుడు అన్నారు.

ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

2019 ఎన్నికల్లో జగన్ వితంతువులు, వృద్ధులకు పెంచుతానన్న వెయ్యి రూపాయలు ఇచ్చేందుకు ఐదేళ్లు పట్టింది అన్నారు.

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పెన్షన్ సొమ్ము రెట్టింపు పెంచి అందించడం సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Related posts