యువ కథానాయకుడు నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం ‘అర్జున్ సురవరం’. బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి బ్యానర్పై టి. సంతోష్ దర్శకత్వంలో రాజ్కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘అర్జున్ సురవరం సినిమా థియేటర్స్లో సందడి చేస్తోంది. మొదటి ఆట నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మా చిత్ర యూనిట్ అందరూ ఈ సక్సెస్తో హ్యాపీగా ఉన్నాము. నిర్మాత ఠాగూర్ మధుగారు, రాజ్ కుమార్గారు రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్, సంతోష్ టేకింగ్ ఇలా అందరి ఎఫర్ట్తో సినిమా అన్ని ఏరియాల్లో బాగా కలెక్ట్ చేస్తోంది. కొంత గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాలో ఉన్న మెసేజ్కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యింది. లావణ్య ఈ సినిమాలో మరో మంచి రోల్ చేసింది. ఈ క్యారెక్టర్ను నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆమెకు థ్యాంక్స్. సినిమా చూడనివారు చూడండి, మిమ్మల్ని అర్జున్ సురవరం తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాడు’’ అన్నారు.
previous post