ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఏపీ హై కోర్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి షాకులు ఇస్తుంటే..ఇపుడు తాజాగా మరో ఊహించని ట్విస్ట్ తగిలింది. ఎన్జీటి లో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు అయింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పై పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టొద్దని పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు అవసరమని వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ రామకృష్ణన్, నిపుణుడు సైబల్ దాసు గుప్త లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. పాత ప్రాజెక్టు అనే ఏపీ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం..డిటైల్ట్ ప్రాజెక్టు రిపోర్ట్ (డి.పి.ఆర్),ప్రాజెక్టు సంబంధిత అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన విషయాన్ని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం ప్రస్తావించింది. గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటీషన్ పై తీర్పు ఎన్.జి.టి వెలువరించింది.
next post


పవన్ కు కుదరలేదు కానీ… చిరంజీవి మాత్రం నా మీద పగ తీర్చుకుంటున్నాడు… : శ్రీరెడ్డి కామెంట్స్