తొలిసారిగా నిర్వహించిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ చారిత్రక విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంట్ ఆసాంతం అజేయంగా నిలవడం మరింత ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “భారత అంధుల మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది.
తొలి అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్నందుకు వారికి అభినందనలు. టోర్నీలో అజేయంగా నిలవడం గర్వకారణం” అని పేర్కొన్నారు. క్రీడాకారుల అద్భుతమైన ప్రతిభను ఆయన ప్రశంసించారు.
“ఈ విజయం క్రీడాకారుల కృషి, పట్టుదల, అకుంఠిత స్ఫూర్తికి ఒక గొప్ప నిదర్శనం.
జట్టులోని ప్రతి క్రీడాకారిణి ఒక ఛాంపియన్. భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది” అని ప్రధాని తన సందేశంలో తెలిపారు.


కాళేశ్వరం, మిషన్ భగీరథ మొత్తం దోపిడీ పథకాలే: కోమటిరెడ్డి