telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధన: నిర్మలా సీతారామన్

Nirmala seetharaman

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనను తీసుకొస్తున్నట్టు తెలిపారు.

దేశీయ కంపెనీలు 22 శాతం రేటుతో ఆదాయపు పన్ను చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఆమె తెలిపారు. దీంతో, సెస్, సర్ ఛార్జ్ లు కలిపి కార్పొరేట్ ట్యాక్స్ 25.17 శాతానికి తగ్గనుంది. అయితే, ఇందులో ఓ షరతును కూడా విధించారు. ఈ కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లభించవని ఆమె తెలిపారు. అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త కంపెనీలకు ట్యాక్స్ ను 15 శాతానికి తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు.

Related posts