telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైకోర్టు విచారణకు హాజరైన ఏపీ డీజీపీ

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి హైకోర్టు విచారణకు హాజరయ్యారు. అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలను యజమానులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. అయితే న్యాయవాది వాదనలతో సంతృప్తి చెందని కోర్టు డీజీపీ స్వయంగా హాజరు కావాలని డీజీపీని ఆదేశించింది. దీంతో,ఈరోజు ఆయన హైకోర్టుకు వచ్చారు.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ అక్రమ మద్యం కేసులో పోలీసు అధికారులు నిబంధనలను పాటించలేదని అన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొందరు పోలీసు అధికారుల పని తీరు సరిగా లేదని వ్యాఖ్యానించింది. మీ న్యాయ సలహా విభాగం సరిగా పని చేయడం లేదని డీజీపీని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు. ఈ కారణం వల్లే మిమ్మల్ని కోర్టుకు పిలిపించాల్సి వచ్చిందని చెప్పారు. మూడు రోజుల్లోగా సీజ్ చేసిన వాహనాలను డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ముందు ప్రవేశపెట్టాలని కోర్ట్ ఆదేశించింది.

Related posts