ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (ఫిబ్రవరి 2026 నాటి సమావేశాల్లో) అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) అంశంపై మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వివరణలు ఇచ్చారు
అమరావతి అభివృద్ధిలో ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టులు అత్యంత కీలకమైనవని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునఃప్రారంభించిందని తెలిపారు.
అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు ఔటర్ రింగ్ రోడ్డు (ORR) రెండింటినీ నిర్మిస్తామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు శాసన సభ లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పై మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూ సమీకరణ, సేకరణ ద్వారా భూమిని సేకరిస్తున్నాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పీపీపీ పద్ధతి లో నిర్మాణం చేస్తున్నాం.
రాజధాని లోని ట్రంక్ రోడ్స్ మౌలిక సదుపాయాలు ADB,ప్రపంచ బ్యాంకు, హడ్కో, నాబార్డ్, వివిధ సంస్థల ద్వారా 40,847 కోట్లు సమకూర్చాం.
ఇన్నర్ రింగ్ రోడ్ భూ సమీకరణ అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం కనీసం 24 నుంచి 30 నెలల సమయం పడుతుంది అన్నారు.
రాజధాని లోని ట్రంక్ రోడ్స్ ఏప్రిల్ 2027 కి పూర్తి చేసేందుకు ప్రణాళిక చేశాం. ఇన్నర్ రింగ్ రోడ్డు లో 96.2. కి.మీ పొడవు,75 మీటర్ల వెడల్పుతో 8+4 వరసలు రోడ్డు నిర్మాణానికి డిజైన్, రెండు ఫేజ్ లలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, మొదటిప్ ఫేజ్ లో కేతన కొండ నుంచి నున్న వరకు నిర్మాణం .
రెండో ఫేజ్ లో నున్న నుంచి కేతన కొండ వరకు నిర్మాణం. మొదటి దశ లో 67.6 కిలోమీటర్ల నిర్మాణం. గుంటూరు జిల్లాలో 14, పల్నాడు జిల్లాలో 3,, కృష్ణ జిల్లాలో 6 , ఎన్టీఆర్ జిల్లాలో 3 గ్రామాలు , మొత్తం 26 గ్రామాల ద్వారా నిర్మాణం.
మొదటి దశకు డీపీఆర్ కూడా సిద్ధమయ్యింది. మొదటి దశ నిర్మాణానికి భూ సమీకరణ ప్రారంభించాం. ఆరు నెలల్లో భూ సమీకరణ పూర్తి చేసే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం అన్నారు.
రాజధాని పరిధిలో 55 ట్రంక్ రోడ్స్ నిర్మాణం. 45 ట్రంక్ రోడ్స్ 18,779 కోట్ల తో టెండర్స్ పిలిచాము. అన్ని నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, బిల్డింగ్స్ కి 6,229 కోట్లు ఇప్పటికే నిర్మాణ సంస్థలకు చెల్లించడం జరిగింది. 2027 మార్చ్ కి ట్రంక్ రోడ్స్ పూర్తి అవుతాయి అని నారాయణ తెలిపారు .

