telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పండుల, జకియా పేర్లు ఖరారు!

Ap council amaravati

ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానమ్ ఉన్నారు.వీరిద్దరి పేర్లను ఖరారు చేసిన ప్రభుత్వం వీరి పేర్లను గవర్నర్‌కు సమర్పించి సిఫారసు చేసింది. పండుల రవీంద్రబాబు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాగా, జకియా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన అభ్యర్థి .

Related posts