telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

గౌత‌మ్ గంభీర్ రెండేండ్ల జీతం విరాళం

Gautam Gambhir bjp

కరోనాపై పోరుకు దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమవంతు సాయాన్ని అందిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో తన రెండేండ్ల జీతాన్ని పీఎం కేర్ నిధికి విరాళంగా ఇవ్వ‌న్నున్న‌ట్లు టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌, ప్ర‌స్తుత బీజేపీ ఎంపీ గౌత‌మ్ గంభీర్ తెలిపాడు. క‌ష్ట‌కాలంలో ప్ర‌తిఒక్క‌రూ త‌మ‌వంతు సాయం అందించాల‌ని రెండు ప్ర‌పంచ‌క‌ప్‌ల హీరో పిలుపునిచ్చాడు.

దేశం నాకేమిచ్చింద‌ని ప్ర‌జ‌లు అడుగుతూ ఉంటారు. కానీ అస‌లు ప్ర‌శ్న అది కాదు. దేశానికి నువ్వేమిచ్చావ్ అనేదే ముఖ్యం. నేను నా రెండేండ్ల జీతాన్ని ప్ర‌ధాని స‌హాయ నిధికి విరాళంగా ఇస్తున్నా. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మీరంతా ముందుకు వ‌చ్చి ప్ర‌భుత్వానికి అండ‌గా నిలువండి` అని గంభీర్ గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపాడు.

Related posts