telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అద్భుత‌మైన పిక్‌తో 2020 స్టార్ట్… సినీత‌ల్లి ముద్దు బిడ్డ‌లు : మంచు విష్ణు

Chiru

గురువారం పార్క్ హ‌య‌త్‌లో జ‌రిగిన మా డైరీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కాస్త ర‌సాభాస‌ అయిన విషయం తెలిసిందే. చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, మోహ‌న్ బాబు, కృష్ణం రాజు, ప‌ర‌చూరి గోపాల‌కృష్ణ‌, ముర‌ళీ మోహ‌న్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ముందుగా చిరంజీవి మాట్లాడ‌గా, ఆ త‌ర్వాత మోహ‌న్ బాబు త‌న స్పీచ్ ఇచ్చారు. చిరంజీవి, త‌న మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని చెబుతూ, మేం అంతా సినీ క‌ళామ్మ‌త‌ల్లి ముద్దు బిడ్డ‌లం అని పేర్కొన్నారు. చిరంజీవికి, నాకు మ‌ధ్య న‌డిచేవి ఛ‌లోక్తులు త‌ప్ప విభేధాలు కావు అని అన్నారు మోహ‌న్ బాబు. దీంతో వెంట‌నే చిరు మోహ‌న్ బాబుని ఆత్మీయ ఆలింగ‌నం చేసుకొని చెంపపై ముద్దిచ్చారు. ఇక కృష్ణం రాజుని తాత అంటూ, ముర‌ళీకృష్ణ‌ని బావ అంటూ అంద‌రిని న‌వ్వించారు మోహ‌న్ బాబు. నిన్న కార్య‌క్ర‌మంలో మోహ‌న్ బాబు, చిరు ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇవే ఫోటోస్‌ని మోహ‌న్ బాబు త‌న‌యుడు మ‌నోజ్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. “సినీ త‌ల్లి ముద్దు బిడ్డ‌లు, అద్భుత‌మైన పిక్‌తో 2020 స్టార్ట్ అయ్యింది” అని పేర్కొన్నారు. మంచు విష్ణు కూడా ఇవే ఫోటోల‌ని షేర్ చేస్తూ.. “ఇద్ద‌రు లెజెండ్స్ ఎంత ప్ర‌శాంతంగా ఉన్నారో. మా త‌రం వారికి స్పూర్తి నింపారు. భవిష్య‌త్ వారిలోను స్పూర్తి నింపిన వారు గ్యాంగ్ స్ట‌ర్స్. మీ మధ్య ఉన్న స్నేహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది” అని విష్ణు తెలిపాడు.

Related posts