telugu navyamedia
క్రైమ్ వార్తలు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్నాహ్నం తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో అభం శుభం తెలియని ఆరు నెలల చిన్నారి కూడా ఉంది. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగింది.

వివార్లాలోకి వెళితే..

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కుటుంబం.. 5 నెలల చిన్నారి మొక్కు తీర్చేందుకు షిఫ్ట్​ కారులో తిరుమ‌ల తిరుపతికి బయల్దేరింది. రేపు శ్రీవారి దర్శనం ఉండటంతో కాణిపాకంలోని సిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడ్నుంచి తిరిగి ప్రయాణం అయ్యారు.ఏపీ 39 హెచ్‌ఏ 4003 అనే నంబర్‌ గల కారు చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామం వద్ద వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు.వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.

5 killed in road accident near to Tirupati, chittoor district.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. స్థానికులు సమాచారం అందించిన వెంటనే అగ్నిప్రమాదశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు.

Related posts