కృష్ణా నది కుడి గట్టున, తాడేపల్లి ప్రాంత వాసులను వరదల నుండి రక్షించడానికి నిర్మించ తలపెట్టిన రిటర్నింగ్ వాల్ (వరద రక్షణ గోడ) కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ 2026, మార్చి 9వ తేదీన శంకుస్థాపన చేసారు.
ప్రాజెక్టు అంచనా వ్యయం: సుమారు ₹294 కోట్లు. 1.7 కిలోమీటర్ల పొడవు మరియు 9 మీటర్ల ఎత్తుతో ఈ గోడను నిర్మించనున్నారు. తాడేపల్లిలోని రైల్వే బ్రిడ్జి నుండి వారధి వరకు ఈ గోడ విస్తరించి ఉంటుంది.
ఈ గోడ నిర్మాణం పూర్తయితే తాడేపల్లి, మహానాడు కాలనీ, మరియు సుందరయ్య నగర్ ప్రాంతాల్లో నివసించే దాదాపు 20,000 మందికి వరద ముప్పు నుండి రక్షణ లభిస్తుంది.
2024 వరదల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త గోడ 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా రూపొందించబడింది.
గతంలో, కృష్ణా నది ఎడమ గట్టున (విజయవాడ వైపు) కృష్ణలంక ప్రాంత వాసుల కోసం ₹123 కోట్ల వ్యయంతో 1.5 కి.మీ పొడవైన రిటర్నింగ్ వాల్ను నిర్మించారు. ఇప్పుడు తాడేపల్లి వైపు గట్టును కూడా పటిష్టం చేసేలా ఈ కొత్త ప్రాజెక్టును చేపట్టారు.

