ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మార్చి 16న ప్రారంభమైన ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని, ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని లోకేశ్ సూచించారు.
‘ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతంగా ఉండండి. 100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు రాయండి. విజయం మీదే. ఆల్ ది బెస్ట్’ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
విద్యార్థులు తమ పూర్తి ప్రతిభను కనబరిచి మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


రైతు సమస్యల ప్రస్తావనే లేదు.. రాష్ట్రపతి ప్రసంగంపై ఉత్తమ్ విమర్శలు