telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

అమరావతి : … రాజధాని రైతులకు .. గడువు పెంపు..

ap high court

రోజురోజుకు రాష్ట్ర రాజధాని అంశంపై పరిస్థితులు ఉత్కంఠగా మారుతున్నాయి. సీఆర్డీఏకు తమ అభిప్రాయాలు తెలిపేందుకు గడువు పెంచాలని రాష్ట్ర హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై టీడీపీ ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ వాదనలు వినిపించారు. రైతులు తమ అభ్యంతరాలను చెప్పుకునేందుకు తగిన సమయం ఇవ్వలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఇందుకోసం గడువును పెంచాలని కోర్టును కోరారు.

కోర్టు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలవరకు గడువును పెంచుతూ ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ను ఆదేశించింది. రైతులు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి వ్యక్తిగతంగా, లిఖితపూర్వంగా, సీఆర్డీఏ వెబ్ సైట్, ఈ మెయిల్ ద్వారా అభ్యంతరాలు తెలపవచ్చని కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 3గంటలకు భేటీ కానుంది.

Related posts