కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించే ఐసోలేషన్ వార్డులను నగరాలకు దూరంగా ఉంచాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సూచించారు. ఐసోలేషన్ కేంద్రాలను నగరాల్లో ఏర్పాటు చేయడం..ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టారు.
“దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు. కరోనా ఐసోలేషన్ వార్డులను నగరానికి దూరంగా పెట్టండి” అని ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మునిసిపల్ కమిషనర్ లను కోరారు. జనావాసాల మధ్యలో ఐసోలేషన్ వార్డులు పెట్టటం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి” అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్ అసత్యాలతో తమకు సవాల్ విసురుతున్నారు: చంద్రబాబు