కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. గత రెండు రోజులుగా ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే షుగర్, సోడియం లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాయి. జ్వరం కూడా తగ్గడంతో ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చింది.
దీంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండు రోజుల పాటు నందినగర్ నివాసంలో ఉండనున్నారు.
అనారోగ్యంతో ఉన్నప్పటికీ శుక్రవారం బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించారు.
షుగర్ లెవల్స్ ఎక్కువగా.. సోడియం లెవల్స్ తక్కువగా ఉన్నాయని.. చికిత్స కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు కేసీఆర్ అనారోగ్యానికి గురవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. శుక్రవారం కేటీఆర్ సైతం కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించారు. కేసీఆర్ కు ఏంకాలేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
తమ అధినేత కోలుకుని రావడంతోె బీఆర్ఎస్ శ్రేణులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నిండూ నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి.. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని రేవంత్ ఆకాంక్షించారు.

