telugu navyamedia
వ్యాపార వార్తలు

సరికొత్త ద్విచక్ర వాహనం ‘నింజా 650’ విడుదల

ప్రస్తుతం ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎన్నో రకాల బైక్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా కవాసకి మోటార్‌(ఐకేఎం) మరో సరికొత్త బైక్‌ను విపణిలోకి తీసుకొచ్చింది. రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని నింజా 650, 2022 ఎడిషన్‌ను బుధవారం విడుదల చేసింది. దీని ధర రూ.6.61 లక్షలు(ఎక్స్‌షోరూం దిల్లీ)గా నిర్ణయించింది.

కొత్తగా విడుదల చేసిన ఈ 2022 ఎడిషన్‌ బైక్‌.. పర్ల్‌ రొబోటిక్‌ వైట్‌, లైమ్‌ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. 2021 ఎడిషన్‌తో పోలిస్తే తాజా ఎడిషన్‌ ధర రూ.7,000 అధికం. మెకానికల్‌గా పెద్దగా మార్పులేమీ చేయలేదు. సెప్టెంబరు నుంచి వీటిని వినియోగదారులకు అందజేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇక ఈ బైక్‌ 649 సీసీ, ప్యారలల్ ట్విన్‌, లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌ 67.4 బీహెచ్‌పీ పవర్‌, 64ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 15 లీటర్ల ఇంధన ట్యాంక్‌ గల ఈ బైక్‌ బరువు 196 కిలోలు. కంపెనీ షోరూంలలో ఇప్పటికే ఈ బైక్‌ బుకింగ్‌లు ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది

Related posts