శాంసంగ్ తన గెలాక్సీ ఎ7 (2018), ఎ9 (2018) ఫోన్ల ధరలను తగ్గించింది. ఈ క్రమంలో గెలాక్సీ ఎ9 (2018) ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.28,990 కు బదులుగా ఇప్పుడు రూ.25,990 ధరకే లభిస్తున్నది. అలాగే ఇదే ఫోన్కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.31,990 కి బదులుగా రూ.28,990 కే లభిస్తున్నది.
గెలాక్సీ ఎ7 (2018) ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.18,990 కి బదులుగా రూ.15,990 ధరకు లభిస్తున్నది. అలాగే ఇదే ఫోన్కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.22,990 కి బదులుగా రూ.19,990 ధరకు లభిస్తున్నది. ఈ క్రమంలో ఈ రెండు ఫోన్లకు చెందిన వేరియెంట్లు ఇప్పుడు వినియోగదారులకు తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి.