telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జగన్ తో భేటీ అయిన .. జూ.ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావు .. !

jr ntr father in law met with jagan

ఏపీలో రాజకీయాలు రోజురోజుగా రసవత్తరంగా సాగుతున్నాయి. ఎక్కడ బలహీనంగా ఉన్నారో కనుక్కొని అక్కడ ఏ పార్టీ వారు బలంగా ఉన్నారో వారిని ఆకర్ష్ పథకం కింద తెచ్చేసుకుంటున్నాయి ఆయా పార్టీలు. ప్రతి పార్టీ పరిస్థితి కూడా ఇదే. అందుకే, కీలక నేతలు అనుకున్నవారంతా.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎంపీలు వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఈ పరిస్థితుల్లో మరో అనూహ్య పరిణామం టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగానే జగన్‌తో భేటీ అయినట్లు నార్నె శ్రీనివాసరావు చెబుతున్నప్పటికీ.. వీరి భేటీ ప్రస్తుతం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. ఎన్టీఆర్ ని వాడుకొని ఆ తర్వాత దూరం పెట్టేశాడు. ఈ క్రమంలోనే నార్నె.. టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. తాజా భేటీతో ఆయన వైసీపీలో చేరుతున్నారేమో అనే ఆందోళన టీడీపీకి లేవనేత్తింది. పార్టీలు మారడం సహజమే అయిన రాజకీయాలలో ఎవరు ఎప్పుడు పార్టీలోకి వస్తారో, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు.. కనుక ఇది ప్రస్తుతానికే పెద్ద వార్త..!

Related posts